News March 18, 2025

రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

image

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

Similar News

News November 18, 2025

ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

image

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్‌ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్‌లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.

News November 18, 2025

ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

image

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్‌ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్‌లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.

News November 18, 2025

మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

image

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.