News March 28, 2025
రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 15, 2025
మావోయిస్టు కొయ్యాడ సాంబయ్య లొంగుబాటు.?

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన కొయ్యడ సాంబయ్య@ గోపన్న లొంగిపోయినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన సాంబయ్య 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల నేతలు వరస లొంగుబాట్లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఆయన అజ్ఞాతం వీడి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సాంబయ్య భద్రాద్రి, అల్లూరి డివిజన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
News November 15, 2025
వరంగల్: ట్రాఫిక్ తనిఖీలతో ప్రజలకు ఇబ్బందులు..?

WGL ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తూ తనిఖీలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసర ప్రయాణాలు కూడా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NSPT ప్రధాన రహదారిపై రామ్ కీ ఎదురుగా ఆకస్మికంగా వాహనాలు ఆపేయడం వల్ల డ్రైవర్లు ఒక్కసారిగా అయోమయానికి గురై, సమస్య ఉన్న ప్రాంతాల్లో కాకుండా అవసరం లేని చోట్ల నియంత్రణ చేయడంపై విమర్శలు చేస్తున్నారు.
News November 15, 2025
సతీశ్ మృతి.. హత్యగా నిర్ధారిస్తూ కేసు నమోదు.!

TTD మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ <<18292217>>మృతి<<>>ని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జీఆర్పీ పీఎస్లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నం.75/2025గా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్ TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈనెల 6న CID విచారణకు వెళ్లిన ఆయన.. నిన్న మరోసారి విచారణకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


