News February 9, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పించేవారు తమ అంశాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు.

Similar News

News September 16, 2025

మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

image

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

‘కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి’

image

కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల, ఇప్పటికే జరిగిన ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం అనువుగా లేనందున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో స్థలాన్ని ప్రతిపాదించామని తెలిపారు. అక్కడ త్వరగా సర్వే చేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలన్నారు.

News September 16, 2025

వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

image

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.