News February 9, 2025
రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పించేవారు తమ అంశాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు.
Similar News
News February 24, 2026
పశ్చిమలో రెచ్చిపోతున్న ‘లంచా’వతారాలు

ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో వరుస అవినీతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ACBకి చిక్కడం సంచలనంగా మారింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పట్టుబడిన 48 గంటల్లోనే, భీమవరంలో అటవీశాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరకడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరుస ఘటనలతో పశ్చిమగోదావరి జిల్లా వార్తల్లో నిలుస్తోంది.
News February 24, 2026
ఉల్లిలో ఆకుమచ్చ, పచ్చ పురుగు, కుళ్లు తెగులు నివారణ

ఉల్లిలో ఆకుమచ్చ తెగులు వల్ల ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఎండిపోతాయి. దీని నివారణకు కార్బండిజం, మాంకోజెబ్ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లిలో ఆకు తినే పచ్చ పురుగు నివారణకు లీటర్ నీటికి కార్బరిల్ 3 గ్రాములు (లేదా) ప్రొపినోఫాస్ 2 mlను కలిపి పిచికారీ చేయాలి. ఇక కుళ్లు తెగులు నివారణకు మెటలాక్సిల్ + మాంకోజెబ్ 3 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News February 24, 2026
థాయ్లాండ్లో కొత్త వైరస్.. జూపార్క్లో ‘బయో- బబుల్’

‘థాయ్లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.


