News February 16, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటన ద్వారా తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఫిర్యాదులు సమర్పించే ప్రజలు వారి అంశాలను లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పారు. ఉదయం 10:30కు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.

Similar News

News October 15, 2025

తాడికొండ: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై కేసు

image

తాడికొండ మండలంలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 15, 2025

సత్తెనపల్లి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

image

సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, మహిళలు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని చితకబాదగా, గ్రామ పెద్దలు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగరాదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

News October 15, 2025

సికింద్రాబాద్: సంతోషం.. ఇప్పటికైనా మేల్కొన్నారు!

image

రైళ్లల్లో రోజూ వేల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వే అధికారులకూ తెలుసు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థా ఉంది. అయితే ఎందుకో రైల్వే అధికారులు అసలు టికెట్ చెకింగ్ అనేదే చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మేల్కొన్న అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించి ఒక్కరోజు (మంగళవారం)లోనే రూ.కోటి పాయలు వసూలు చేశారు. ముందు నుంచే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.