News February 16, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటన ద్వారా తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఫిర్యాదులు సమర్పించే ప్రజలు వారి అంశాలను లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పారు. ఉదయం 10:30కు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.

Similar News

News March 25, 2025

గద్వాల: ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం

image

పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి, నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. మంగళవారం గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను తెలుసుకున్నారు.

News March 25, 2025

BIG BREAKING: ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రోల్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: <>https://cbseit.in/cbse/<<>>

News March 25, 2025

అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?

image

అల్యూమినియం పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అల్యూమినియం ఆహారం, నీటిలో సహజంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల న్యూరో టాక్సిక్ ప్రభావాలను కలిగించవచ్చు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. అధిక వేడి వద్ద ఇది ఆహారంలో కలవొచ్చు. ఈ అధిక అల్యూమినియం ఎముకలు, లివర్, కిడ్నీలను ప్రభావితం చేయొచ్చు. అందుకే స్టీల్, కాస్ట్ ఐరన్ పాత్రలను వాడితే బెటర్’ అని తెలిపారు.

error: Content is protected !!