News December 16, 2024

రేపు మంగళరికి రానున్న రాష్ట్రపతి 

image

మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ మధబానందకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి 49మంది ఎంబీబీఎస్, నలుగురు పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారన్నారు.

Similar News

News January 19, 2025

గుంటూరులో CA విద్యార్థి ఆత్మహత్య

image

బ్రాడీపేటలో ఆత్మహత్యకు పాల్పడింది CA చివరి సంవత్సరం చదువుతున్న కె.నాగప్రసాద్ (27) గా అరండల్ పేట పోలీసులు నిర్ధారించారు. గూడూరు పట్టణానికి చెందిన నాగప్రసాద్ ఆదివారం హాస్టల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనతో విజ్ఞాన కేంద్రానికి చిరునామాగా ఉన్న బ్రాడీపేటలో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నాగప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 19, 2025

పిట్టలవానిపాలెంలో రోడ్డు ప్రమాదం

image

పిట్టలవానిపాలెం మండలం భావనారాయణపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. 

News January 19, 2025

డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల విచారణ

image

మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.