News February 27, 2025

రేపు మహబూబాబాద్‌లో డయల్ యువర్ డీఎం

image

మహబూబాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో రేపు డయల్ యువర్ డీఎం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ పరిసర ప్రజలు, ప్రయాణికులు పాల్గొని 8500324880 నంబరుకు కాల్ చేసి తమ సలహాలు, సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

సదరం రీ-అసెస్‌మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

image

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్‌మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్‌మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 28, 2025

ఖమ్మం: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18కి వాయిదా

image

ఖమ్మం నగరంలోని ప్రసాద్ భవన్‌లో శుక్రవారం సీపీఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరగాల్సిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జనవరి 18కి వాయిదా వేసినట్లు వారు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జనవరి 18న జరిగే జయంతి ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

News November 28, 2025

2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: సీఎం

image

AP: రాజధాని అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2028 మార్చికి పూర్తయ్యేలా అమరావతి పనులు సాగుతున్నాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.