News January 23, 2025
రేపు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

ములుగు జిల్లాలో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు మల్లంపల్లి మండల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడారం చేరుకొని మినీ మేడారం జాతరపై రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు తాడ్వాయిలోని బ్లాక్ బెర్రీ దీవులను ప్రారంభిస్తారు. అనంతరం ములుగు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
Similar News
News December 6, 2025
VKB: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. అధికారి సస్పెండ్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విధులకు గైర్హాజరైనా ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు సమర్థవంతంగా, సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 6, 2025
విజయనగరం: పెన్షన్ దారులకు అలర్ట్.!

జిల్లాలో కుటుంబ పెన్షన్ దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగ మహేశ్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఖజానా కార్యాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించవచ్చని తెలిపారు.
News December 6, 2025
‘పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి’

పదో తరగతిలో విద్యార్థులు ఈ సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంఈఓలు ఇతర అధికారులతో కలెక్టర్ శనివాకం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సమాజంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలన్నారు.


