News June 6, 2024

రేపు మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్న మంత్రి

image

రేపు మధ్యాహ్నం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. సుందిళ్ల బ్యారేజీలో NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారలు బ్యారేజీల పరిస్థితి వివరించనున్నారు.

Similar News

News October 2, 2024

కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు. మూసీపై బీఆర్ఎస్ వైఖరిని తెలపాలన్నారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని అన్నారు.

News October 2, 2024

విజయభారతికి నివాళులర్పించిన కేటీఆర్

image

ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా తల్లి, ప్రముఖ రచయిత్రి విజయభారతి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాహుల్ బొజ్జ నివాసానికి వెళ్లి వారీ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విజయ భారతి మరణం బాధాకరమని ఆవేదన చెందారు. విజయభారతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News October 2, 2024

రాహుల్ గాంధీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

image

హైడ్రా విషయంలో రాహుల్ గాంధీపై సిరిసిల్ల MLA కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ను రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చాడని బుధవారం విలేకరుల చిట్ చాట్‌లో ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ హైడ్రాను నడిపిస్తున్నాడన్నారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తుండని స్పష్టం చేశారు.