News April 25, 2024

రేపు రాజంపేటకు పవన్, చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్‌లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.

Similar News

News December 6, 2025

కడప: ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలపై GST దాడులు.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. పెనాల్టీ విధించారు. ప్రొద్దుటూరులో 4 ట్రాన్స్‌పోర్ట్, 3 ట్రావెల్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

News December 6, 2025

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

image

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.

News December 6, 2025

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

image

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.