News March 7, 2025
రేపు వనపర్తికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వనపర్తి పట్టణ స్థానిక సమస్యలపై అధ్యయనం చేసేందుకు శనివారం వనపర్తికి వస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు తెలిపారు. ప్రజా సమస్యలను పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి మార్చి చివరి దాకా సమస్యలపై సర్వేలు, ఆందోళనలు జరుగుతాయన్నారు.
Similar News
News December 7, 2025
అనంతపురంలో అన్నదమ్ములు మృతి..!

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి అన్నదమ్ములు నరేంద్ర(32), చరణ్(25) మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బ్రహ్మసముద్రం మండలానికి చెందిన చరణ్ కాలు జారి నీటికుంటలో పడ్డాడు. అన్న నరేంద్ర అతణ్ని కాపాడేందుకు నీటి కుంటలోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News December 7, 2025
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్టే!

* పాదాలు తిమ్మిరిగా లేదా మండుతున్నట్టుగా అనిపిస్తుంది
* ఉన్నట్టుండి బాడీకి షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.
* పని మీద శ్రద్ధ పెట్టలేక ఇబ్బంది పడతారు.
* అన్ని సమయాలలోనూ అలసిపోయిన భావన కలుగుతుంది.
* చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతుంటారు.
* మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లు బలహీనంగా అనిపిస్తాయి.
News December 7, 2025
రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.


