News March 7, 2025
రేపు వనపర్తికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వనపర్తి పట్టణ స్థానిక సమస్యలపై అధ్యయనం చేసేందుకు శనివారం వనపర్తికి వస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు తెలిపారు. ప్రజా సమస్యలను పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి మార్చి చివరి దాకా సమస్యలపై సర్వేలు, ఆందోళనలు జరుగుతాయన్నారు.
Similar News
News November 28, 2025
గట్టుప్పల్: అక్కడ ఓటు వేయాలంటే.. 3 కిలోమీటర్లు నడవాల్సిందే!

గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లకు ఓటు వేసేందుకు తిప్పలు తప్పడం లేదు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని రంగంతండా, అజనాతండా, దేవులతండా, రాగ్యాతండాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. సుమారు 3 కి.మీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
News November 28, 2025
MHBD జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

MHBD, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా.. మిగిలిన 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మహిళలు 2,83,064 ఉండగా, 2,73,682 మంది పురుషులు, 24 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీ, 4110 వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు కాగా.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
News November 28, 2025
NLG: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పుడు మండలి ఛైర్మన్!

గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పేరు తెలియని వారు ఉండరు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన శాసనమండలి ఛైర్మన్గా అంచలంచెలుగా ఎదిగారు. వార్డు సభ్యుడు.. మండలి ఛైర్మన్ వరకు ఎదగడం రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తినిస్తుంది. సుఖేందర్ రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో ఉరుమడ్ల జీపీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు.


