News April 28, 2024
రేపు వనపర్తిలో మూడు జిల్లాల సీపీఎం సమావేశం

సీపీఎం నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం సోమవారం వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ తెలిపారు. సమావేశానికి నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల సీపీఎం నాయకులు, కార్యకర్తలు హాజరవుతాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం వైఖరి అనే అంశంపై సమావేశం ఉంటుందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జాన్ వెస్లీ హాజరవుతారని తెలిపారు.
Similar News
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.
News November 18, 2025
బాలానగర్: ఫోన్పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


