News February 1, 2025

రేపు సంబేపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

image

రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లిలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.

Similar News

News December 4, 2025

తిరుపతి SVUలో ఇంత దారుణమా..?

image

తిరుపతి SVU పరిధిలో 1991 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన వాళ్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో పేపర్‌కు రూ.2వేలు, 3పేపర్లకు మించితే రూ.4వేలు చొప్పున ఫీజు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ ఇవ్వలేదు. డబ్బులు కట్టి సంవత్సరం దాటుతున్నా పరీక్షల తేదీ వెల్లడించకపోవడంతో SVUలో ఇంత దారుణమా? అని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News December 4, 2025

తిరుపతి SVUలో ఇంత దారుణమా..?

image

తిరుపతి SVU పరిధిలో 1991 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన వాళ్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో పేపర్‌కు రూ.2వేలు, 3పేపర్లకు మించితే రూ.4వేలు చొప్పున ఫీజు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ ఇవ్వలేదు. డబ్బులు కట్టి సంవత్సరం దాటుతున్నా పరీక్షల తేదీ వెల్లడించకపోవడంతో SVUలో ఇంత దారుణమా? అని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News December 4, 2025

ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మోటకొండూరులో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులకు వచ్చిన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని, ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.