News February 1, 2025
రేపు సంబేపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లిలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
Similar News
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోవడం, వికారం ఉంటాయి. ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితాలు ‘పాజిటివ్’ అని వస్తాయి. రక్తస్రావం కావడం, పొత్తికడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్లలో, లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంటుంది.
News November 28, 2025
కంపు కొడుతున్న BHPL మున్సిపాలిటీ..!

BHPL మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో చెత్త పేరుకుపోయి కంపు కొడుతోంది. ఇటీవల బొల్లిరాజయ్య అనే మున్సిపల్ కార్మికుడు విధినిర్వహణలో మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. అలాగే, చెత్త సేకరణకు సరిపడా వాహనాలు లేవని శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అందుకే చెత్త సేకరించట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులు.. 6541 ఉద్యోగాలు

AP: రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ <<18408811>>కార్యాలయాలు<<>> ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకోసం రూ.1,328 కోట్లు వెచ్చించనుండగా 6,541 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థల జాబితా ఇదే.. APGB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOB, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.


