News January 22, 2025

రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

image

హుస్నాబాద్: పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని 15వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి హనుమాన్ గుడి సమీపంలో వార్డు సభలో పాల్గొననున్నారు. 2వ వార్డులో పోచమ్మ కమాన్ ప్రారంభించనున్నారు.

Similar News

News December 9, 2025

పాలమూరు: ఓటు వేయాలంటే 10 కి.మీ నడవాల్సిందే..!

image

నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తీవ్రంగా కష్టపడుతున్నారు. వరహాబాద్, మల్లాపూర్ చెంచులు మన్ననూరుకు, కొమ్మన పెంట, కొల్లం పెంట ఓటర్లు దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు నడవాలి. గిసుగండి ఓటర్లు మద్దిమడుగు రావడానికి కూడా 10 కిలోమీటర్లు నడక తప్పడం లేదు.

News December 9, 2025

ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని..!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాత్రుళ్లు పార్టీలు ఇస్తుండటంతో పాటు సిటీలో ఉద్యోగం చేసే వారికి కాల్ చేసి ఛార్జీలు ఇస్తాం రమ్మంటూ ఆఫర్ చేస్తున్నారు. అటు దండాలు పెడుతూ, కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు చోట్ల పిల్లలు, దేవుడిపై ఒట్లు వేయించుకొని మాట తీసుకుంటున్నారు. ఇతర అభ్యర్థులపై నిఘా పెట్టి వారికి పోటీగా ప్రమాణాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు.

News December 9, 2025

వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్‌’.. స్పష్టత ఏది?

image

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.