News August 4, 2024

రేపు CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సోమవారం సీఎం చంద్రబాబు ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నందున, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మీకోసం కార్యక్రమానికి గైర్హాజరవుతారన్నారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారితోపాటు, ఇతర అధికారులు మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

Similar News

News October 31, 2025

ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

image

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2025

ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

News October 31, 2025

ప్రకాశం: ‘ఆక్వా రైతుల కంటతడి’

image

ప్రకాశం జిల్లా తీర ప్రాంతాన్ని నమ్ముకుని వేలమంది ఆక్వా రైతులు జీవిస్తున్నారు. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పపాడు మండలాల్లో ఆక్వా సాగు చేసిన రైతులు మొంథా తుఫాను దాటికి దెబ్బతిన్నారు. అదిక వర్షాలతో వల్ల కరెంట్ కోతలతోపాటు, చెరువుల్లో ఉప్పు నీటిశాతం తగ్గడంతో రొయ్యలు సరిగా మేత తినక డల్లయ్యాయి. తుఫానుకు ముందే అమెరికా సుంకాలతో ఆక్వా రైతులు కుదేలు కాగా మొంథా తుఫాన్ మరింత చిక్కులు తెచ్చింది.