News April 11, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠలో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోనే 1వ సంవత్సరం 35,688, 2వ సంవత్సరం 35,946మంది మొత్తం 71,634 మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News October 19, 2025
గుంటూరు: ‘కాలుష్యం లేని దీపావళి..ఆనందమైన దీపావళి’

కాలుష్యం లేని దీపావళి ఆనందమైన దీపావళిని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి దీపావళిపై రూపొందించిన పోస్టర్ను శనివారం కలెక్టర్ విడుదల చేశారు. దీపాలను వెలిగించడం మన సంస్కృతిలో భాగమని కాలుష్యానికి కారణమయ్యే టపాసుల జోలికి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఈ నెల 20న దీపావళి పండగ సందర్భంగా ప్రజలు హరిత టపాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
News October 18, 2025
GNT: వారి భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోలీసులు గంజాయి పట్టుకుంటున్నారు. ఇటీవల యువతలో మాదకద్రవ్యాల వాడకం పెరగటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మత్తు పదార్థాల వాడకానికి దారితీసే అనుమానాస్పద ప్రవర్తన, స్నేహ వర్గం, ఆకస్మిక మార్పులను తల్లిదండ్రులు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. @ యువ భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!
News October 18, 2025
లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి: కలెక్టర్

PC PNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అల్ట్రా సౌండ్ క్లినిక్లు కలిగిన నర్సింగ్ హోమ్లు, ఇమేజింగ్ కేంద్రాలు, జెనెటిక్ మొబైల్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, సరోగసి క్లినిక్లు తదితర సంస్థలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.