News April 11, 2025
రేపే రిజల్ట్.. అనకాపల్లి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఫస్టియర్ 12,936 మంది, సెకండియర్ 13,225 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 26 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 25, 2025
హీరో అజిత్కు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

సినిమాల్లో నటిస్తూనే ప్రొఫెషనల్ కార్ రేసర్గానూ హీరో అజిత్ రాణిస్తున్నారు. కార్ రేసింగ్ ఇండస్ట్రీలో సాధించిన విజయాలు, ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ ట్రాక్లో ఇండియా ప్రతిష్ఠను పెంచినందుకు ‘జెంటిల్మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారాన్ని ఫిలిప్ చారియోల్ మోటార్స్పోర్ట్స్ గ్రూప్ అందజేసింది. ఇటలీలో జరిగిన కార్యక్రమంలో అజిత్కు SRO మోటార్స్పోర్ట్స్ గ్రూప్ సీఈవో స్టెఫాన్ రాటెల్ అవార్డు అందజేశారు.
News November 25, 2025
అఫ్గాన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 10 మంది మృతి

అఫ్గానిస్థాన్తో వివాదం వేళ ఆ దేశంపై పాకిస్థాన్ అర్ధరాత్రి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఖోస్త్, పాక్టికా, కునార్ ప్రావిన్స్లో మిస్సైల్స్తో విరుచుకుపడింది. దీంతో 10 మంది అఫ్గాన్ పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులే కావడం విషాదకరం. అఫ్గాన్ తమను లెక్కచేయకపోవడం, భారత్కు దగ్గరవుతుండటాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దొంగదెబ్బ తీసింది.
News November 25, 2025
సత్తమ్మ LPG సబ్సిడీ కూడా రాజన్న అకౌంట్లోనే..!

వేములవాడకు చెందిన మహిళా రైతు ఏదుల సత్తమ్మ వంట గ్యాస్ సబ్సిడీ కొంతకాలంగా రాజన్న ఆలయ ఖాతాలోనే పడుతోంది. సత్తమ్మ పత్తి విక్రయించిన సొమ్ము ఆమె సొంత ఖాతాలో కాకుండా ఆలయ ఖాతాలో జమ కాగా, ఆమె ఆధార్ నంబర్తో రాజన్న ఆలయ బ్యాంకు ఖాతా పొరపాటున అనుసంధానం కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు. పొరపాటుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


