News April 11, 2025
రేపే రిజల్ట్.. నంద్యాల జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. నంద్యాల జిల్లాలో ఫస్టియర్ 15,692 మంది, సెకండియర్ 13,400 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 16, 2025
ONGCలో 2,623 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ongcindia.com/
News November 16, 2025
హనుమాన్ చాలీసా భావం – 11

లాయ సంజీవన లఖన జియాయే। శ్రీ రఘువీర హరషి ఉరలాయే॥ సంజీవని తెచ్చి హనుమంతుడు లక్ష్మణుడికి ప్రాణం పోశాడు. ఈ ఘనకార్యాన్ని చూసిన రాముడు ఆనందంతో ఆయనను హృదయానికి హత్తుకున్నాడు. మనం నిస్వార్థంగా, అంకితభావంతో, ధైర్యంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఆ శ్రమకు తగిన గౌరవం, ఉన్నతమైన ప్రేమ, అపారమైన ఆనందం లభిస్తాయి. గొప్ప పనులు చేసిన వారిని లోకం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ దేవుడు కూడా! <<-se>>#HANUMANCHALISA<<>>
News November 16, 2025
నిర్వాహకుడితోనే ‘iBOMMA’ సైట్ క్లోజ్ చేయించారు!

ఐబొమ్మ, బప్పంటీవీ సైట్లను వాటి నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు క్లోజ్ చేయించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయకండి’ అని గతంలో అతడు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్నాడో ఎవరూ గుర్తించకుండా జాగ్రత్త పడినప్పటికీ సవాల్ను స్వీకరించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. లాగిన్ వివరాలతో సైట్ను మూసివేయించారు. తెలంగాణ సైబర్ పోలీసుల సత్తా ఏంటో చూపించారు.


