News April 11, 2025
రేపే రిజల్ట్.. పార్వతీపురం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్టియర్ 8,968 మంది, సెకండియర్ 8,881 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 34 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News January 10, 2026
నెల్లూరు: త్వరలో మూడు చోట్ల ఇసుక రీచ్లు.?

పెన్నా పరీవాహక ప్రాంతంలో మరో 3 చోట్ల కొత్త ఇసుక రీచ్లు రానున్నాయట. ఇప్పటికే పొట్టేపాలెం, సంగం, సూరాయాపాలెం వద్ద పాయింట్లు ఉండగా విరువూరు వద్ద ఓపెన్ రీచ్ ఉంది. వీటితోపాటు మైన్స్ అధికారులు చేజర్ల మండల పరిధిలో మాముడూరు, కోటితీర్ధం, నెల్లూరు రూరల్లో ములుముడి ప్రాంతాల్లో కొత్తగా రీచ్లు ఓపెన్ చేసేందుకు కలెక్టర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. లేగుంటపాడులోనూ రీచ్ కోసం అధికారులు పరిశీంచారు.
News January 10, 2026
కేంద్రం ముందు ఏపీ మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలు!

కేంద్ర బడ్జెట్లో APకి ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధి, సాస్కీ, పూర్వోదయ పథకాలకు నిధులు, వైజాగ్ ఆర్థిక ప్రాంతీయాభివృద్ధికి ₹5వేల కోట్ల కేటాయింపు, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వాలంటూ ప్రతిపాదనలు చేశారు.
News January 10, 2026
ప్రజావాణికి పెద్ద శంకరంపేటలో కలెక్టర్ హాజరు

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


