News June 3, 2024

రేపే RESULTS.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?

image

లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడనుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 22, 2024

RRR సౌత్ అలైన్‌మెంట్ ఖరారుకు ప్రత్యేక కమిటీ

image

HYD శివారులో RRR దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. RR, VKB జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలు భాగంగా ఉంటారు. వీరితో పాటుగా ఇతర జిల్లాల కలెక్టర్లు, R&B, NHAI అధికారుల బృందం కలిసి విస్తృతంగా అధ్యయనం చేపట్టనుంది.

News September 21, 2024

నగరవాసులకు GHMC కమిషనర్ కీలక విజ్ఞప్తి

image

నగరవాసులకు GHMC కీలక విజ్ఞప్తి చేసింది. ‘నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇంట్లోనే ఉండండి. అనవసర ప్రయాణాన్ని మానుకోండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండండి. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించండి. అహోరాత్రులు సేవలు అందించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.