News January 18, 2025
రేవంత్ తప్పి దారిన సీఎం పీఠంపై కూర్చున్నారు: డీకే అరుణ

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆమె మాట్లాడుతూ.. KCR పై వ్యతిరేకతతో తప్పి దారిన రేవంత్ సీఎం పీఠంపై కూర్చున్నారు అంతే తప్పా కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. తెలంగాణలో పథకాల అమలుపై మహారాష్ట్ర, హర్యానాలో చెప్పిన అబద్ధాలనే రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారని మండిపడ్డారు. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్కు గుణపాఠం తప్పదన్నారు.
Similar News
News February 10, 2025
HYD: నుమాయిష్కు 80వేల మంది

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు సందర్శకులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్కు లక్షల సంఖ్యలో సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో 80 వేల మంది నుమాయిష్ను సందర్శించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 15న నమాయిష్ ముగియనుంది.
News February 10, 2025
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్డిపల్లిలో 14.2℃, తాళ్లపల్లి 14.5, చందనవెల్లి 14.7, చుక్కాపూర్ 14.8, ఎలిమినేడు, కాసులాబాద్ 15.5, రాజేంద్రనగర్ 15.7, రాచలూరు, కేతిరెడ్డిపల్లి, తొమ్మిదిరేకుల 15.9, కొందుర్గ్, వెల్జాల 16.1, ప్రోద్దటూర్, సంగెం 16.3, వైట్గోల్డ్ SS 16.4, కడ్తాల్, మంగళపల్లి 16.5, యాచారం, మీర్ఖాన్పేట 16.7, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, కందువాడలో 16.8℃గా నమోదైంది.
News February 10, 2025
శంషాబాద్ నుంచి కుంభమేళాకు తరలివెళ్తున్న ప్రజలు

ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు వృద్ధులు, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆదివారం అంతర్జాతీయ విమాన సర్వీసులో 84,593 మంది ప్రయాణించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.