News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. హైదరాబాద్ REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు HYD, ఉమ్మడి RRలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రూ.200 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, హైడ్రాతో అక్రమ నిర్మాణాల తొలగింపు ఇందుకు రూ.50 కోట్ల కేటాయింపు, చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనకు రూ.1,500 కోట్ల కేటాయింపు, కొత్త పరిశ్రమలతో జాబ్స్, పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. మీ కామెంట్?
Similar News
News January 26, 2025
HYD: చిట్టి భరతమాత.. అదుర్స్ కదూ!
రిపబ్లిక్ డే వేడుకలు గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పరిధి ఆరుట్లకు చెందిన శ్రుతి తన దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమార్తెను భరతమాతగా అలంకరించి వావ్ అనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News January 26, 2025
HYD: చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: దాసోజు శ్రవణ్
దావోస్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను చూసి తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు కడుపు మంట అని కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్లను ఏర్పాటు చేయడం చిల్లర పనులని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. HYDలో హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ఈ తరహా చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
News January 26, 2025
త్రివర్ణ శోభతో జంట నగరాలు
గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.