News December 29, 2024
రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థులకు శాపంగా: హరీష్ రావు

విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, సీఎం చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో విష ఆహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం CM పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
Similar News
News November 17, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
News November 17, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
News November 17, 2025
MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.


