News January 25, 2025

రేవు పోలవరం హైస్కూల్‌ని విజిట్ చేసిన DEO

image

అనకాపల్లి DEO అప్పారావు ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం హైస్కూల్‌ని శుక్రవారం విజిట్ చేశారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన కౌశిల్ ప్రతిభా పరీక్షల్లో రాణించిన పాఠశాల విద్యార్థులు ఐశ్వర్య, నాగరాజు, దయానంద్‌కు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో మంచి ప్రతిభ దాగి ఉంటుందన్నారు. ఆ ప్రతిభను వెలికితీసే ప్రయత్నం టీచర్స్ చెయ్యాలన్నారు. HM శ్రీను, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

ASF: ఫొక్సో కేసులో నిందితుడికి 35ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను అపహరించి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు సాయి చరణ్ రెడ్డికి 35ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. 2013లో నమోదైన ఈ కేసులో పీపీఈ శ్రీనివాస్, దర్యాప్తు అధికారుల వాదనలు ఆధారంగా శిక్ష ఖరారైంది. బాధితురాలికి న్యాయం జరిగేలా పనిచేసిన అధికారులను ఎస్పీ నితికా పంత్ అభినందించారు.

News December 5, 2025

మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

News December 5, 2025

స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలెక్కడ?: ఎంపీ

image

స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు ఎలాంటి కార్యాచరణను ఆచరిస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశీయ తయారీదారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాల గురించి, రక్షణ సముపార్జన ప్రక్రియకు కేంద్రం ఏమైనా సవరణలు చేసిందా? అడిగారు. దీనిపై కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ స్పందిస్తూ.. స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు.