News January 25, 2025

రేవు పోలవరం హైస్కూల్‌ని విజిట్ చేసిన DEO

image

అనకాపల్లి DEO అప్పారావు ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం హైస్కూల్‌ని శుక్రవారం విజిట్ చేశారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన కౌశిల్ ప్రతిభా పరీక్షల్లో రాణించిన పాఠశాల విద్యార్థులు ఐశ్వర్య, నాగరాజు, దయానంద్‌కు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో మంచి ప్రతిభ దాగి ఉంటుందన్నారు. ఆ ప్రతిభను వెలికితీసే ప్రయత్నం టీచర్స్ చెయ్యాలన్నారు. HM శ్రీను, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.

News December 6, 2025

రంగారెడ్డి: FREE కోచింగ్.. నేడే లాస్ట్!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. సీసీటీవీ కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలతో ఈనెల 6లోగా దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8500165190కు సంప్రదించాలన్నారు. #SHARE IT.

News December 6, 2025

దొరవారిసత్రం PSలో పోక్సో కేసు.. ముద్దాయికి 3 ఏళ్ల శిక్ష.!

image

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని కృష్ణాపురంలో జరిగిన పోక్సో కేసులో కల్లెంబాకం సుమన్‌కు నెల్లూరు పోక్సో కోర్టు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించింది. బాధితురాలిని 2022 డిసెంబర్ 6న కత్తితో బెదిరించి అక్రమంగా తాకిన ఘటనపై Cr.No.79/2022 కింద కేసు నమోదు కాగా.. 354(A), 506 IPC- POCSO సెక్షన్ 7 r/w 8 కింద నేరం రుజువైంది.