News December 31, 2024
రేవ్ పార్టీలో ప.గో.జిల్లా వ్యక్తులే కీలకం

తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి ప.గో. జిల్లా TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలతో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10 మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.
Similar News
News November 12, 2025
తణుకు: వీడిన మిస్టరీ.. ఆస్తి కోసం కూతురినే చంపేశారు!

తణుకు(M) ముద్దాపురానికి చెందిన <<18261784>>యువతి సజీవ దహనం<<>> కేసు మిస్టరీ వీడింది. గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగ హరితకు తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి కోసం సవతి తల్లి రూప, తండ్రి ముళ్లపూడి శ్రీనివాస్ 2022 NOV 12న హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టులో హత్యగా నిర్ధారణ కావడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం హత్య జరిగిన సరిగ్గా ఇదే రోజున కేసు మిస్టరీ వీడటం గమనార్హం.
News November 12, 2025
పాలకొల్లు: మంత్రి ట్వీట్.. దివ్యాంగుడికి త్రీవీలర్ మోటార్ సైకిల్ అందజేత

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన దివ్యాంగుడు వెంకటేశ్వరరావు ఇటీవల పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి త్రీవీలర్ మోటార్ సైకిల్ కావాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయాన్ని మంత్రి ట్విట్టర్లో పెట్టగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించి తాను పంపిస్తానని రీట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బార్లో దివ్యాంగుడికి వాహనాన్ని లోకేశ్ అందజేశారు.
News November 12, 2025
తణుకు: మలుపు తిరిగిన యువతి సజీవ దహనం కేసు

తణుకు(M) ముద్దాపురం గ్రామానికి ముళ్ళపూడి నాగ హరిత (19)సజీవ దహనం కేసు కీలక మలుపు తిరిగింది. 2022 NOV 12న జరిగిన ఈ ఘటనలో హరితను తలపై కొట్టి చంపి అనంతరం పెట్రోలు పోసి తగలబెట్టినట్లుగా తాజాగా ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని అప్పటి పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో తణుకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


