News August 30, 2024

రేషన్ కార్డుదారులకు తీపి కబురు

image

రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు పంచదార పంపిణీకి చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ 2 నెలలుగా పంచదార పంపిణీ ఆపేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో 6,76,209 మంది రేషన్ కార్డుదారులకు 10,715 టన్నుల బియ్యం, 352 టన్నుల పంచదార, నంద్యాల జిల్లాలో 5,41,804 మంది కార్డుదారులకు 7,361 టన్నుల బియ్యం, 276 టన్నుల పంచదార పంపిణీ చేయనుంది.

Similar News

News November 11, 2025

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి: మంత్రి

image

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై కలెక్టర్ సిరితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News November 10, 2025

ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

image

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.

News November 10, 2025

కర్నూలు జిల్లాకు పతకాలు

image

ఈనెల 7 నుంచి 9 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19, 14 విభాగాలలో రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పతకాల పంట సాధించినట్లు జిల్లా కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విజేతలుగా నిలిచిన రామ్ జిగ్నేష్, నక్షత్ర, అన్నా జెన్ క్రీడాకారులను సత్కరించారు. జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నారు.