News April 11, 2025
రేషన్ కార్డు ఈ కేవైసీలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం

రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పౌర సరఫరా శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. బాపట్ల జిల్లాలో మొత్తం 12,90,164 మంది రేషన్ దారులు ఉండగా వారిలో 12,08,479 మంది ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు కాకుండా 69,202 మంది ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోనే 93.67%తో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News October 19, 2025
సత్తుపల్లిలో 3,000 ఉద్యోగాలకు మెగా జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో TASKసహకారంతో ఈ నెల 26న సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఓసీ పీఓలు ప్రహ్లాద్, ఎంవీ. నరసింహారావులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన 50 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. ఇంటర్వ్యూలను 23, 24, 25 తేదీలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేపట్టనున్నారు. నిరుద్యోగులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 19, 2025
బద్వేల్ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్

బద్వేల్పై TDP అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ విషయంలో నియోజకవర్గంలోని ప్రజలకు IVRS కాల్స్ చేసి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితీశ్ రెడ్డి, DCC బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లను పేర్కొంది. బద్వేలులో ఎవరైనా నాయకుడిగా ఎదిగారంటే అది వీరారెడ్డి కుటుంబం దయేనని, రితీశ్ రెడ్డే తమ నాయకుడు అని పలువురు TDP నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు.
News October 19, 2025
వరంగల్: నేడు భోగి.. 22 వరకు దీపావళి సందడి

ఇంటిల్లిపాదినీ అలరించే దివ్వెల పండగ రానే వచ్చింది. నేడు భోగి పండగతో ప్రారంభమయ్యే వేడుకలు ఈ నెల 21న నోములతో ముగుస్తాయి. 20న దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. భోగి స్నానాలతో ప్రారంభమై కేదారీశ్వర వ్రతాలు నోములు ఎత్తుకునే వరకు వేడుకలు జోరుగా సాగుతాయి. దీపావళిని పురస్కరించుకొని పూల దుకాణాలు, నోము సామానులు, టపాసుల షాపులు సిద్ధమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి నెలకొంది.