News April 4, 2025
రేషన్ దుకాణంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తనిఖీ

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
Similar News
News April 17, 2025
ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడం నేరమా?: MLC కవిత

ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడమే నేరమా.. ఇది ప్రజా పాలనా? పోలీసుల పాలనా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని అడిగినందుకు భీంగల్ లో BRS పార్టీ కార్యకర్తలపై మంత్రి జూపల్లి కృష్ణారావు పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జి చేయించి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె డిమాండ్ చేశారు.
News April 17, 2025
కృష్ణా జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లాకు మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా 8 మందిని ప్రభుత్వం బుధవారం నియమించింది. వీరిలో 7 టీడీపీకి, 1 మాత్రమే జనసేనకు చెందడం ఆసక్తికర చర్చలకు దారి తీసింది. అధికార కూటమిలో భాగమైనా జనసేనకు తక్కువ ప్రాధాన్యం ఎందుకు కలిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చలు సాగుతోందన్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి అసలు ఏమి అవకాశం లభించలేదు. 2 పార్టీల సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
News April 17, 2025
శంఖవరం: చెప్పుల దండ వేసిన నిందితుడి అరెస్ట్

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. నిందితుడి పేరు పడాల వాసు (20) అని, అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ అన్నారు. అనంతరం వారిని అభినందించారు.