News April 5, 2025
రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Similar News
News April 9, 2025
నల్గొండ జిల్లాలో CONGRESS VS BRS

నల్గొండ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
News April 9, 2025
NLG: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసి, షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

చైల్డ్ పోర్న్ వీడియోలు చూసి ఇతర గ్రూప్లకు షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. CI రాజు తెలిపిన వివరాలు.. హుజూర్నగర్ గాంధీ పార్క్ చౌరస్తాకు చెందిన శ్రీనివాసరావు నాలుగేళ్లుగా సెల్ ఫోన్లో చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. వాటిని డౌన్లోడ్ చేసి ఇతర గ్రూప్లకు షేర్ చేయడంతో సైబర్ సెక్యూరిటి అధికారులు గమనించి HNR పీఎస్కు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
News April 8, 2025
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.