News April 5, 2025

రేషన్ లబ్ధిదారుల ఇంట్లో తింటాం: నిర్మల్ కలెక్టర్ అభిలాష

image

సన్న బియ్యం పంపిణీ పట్ల జిల్లా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తీ ఏర్పాట్లను చేశామన్నారు. ప్రతి నెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన భోజనాన్ని స్వీకరిస్తామని చెప్పారు.

Similar News

News February 25, 2026

మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

image

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.

News February 25, 2026

డయేరియా, కల్తీ పాల ఘటనలపై సీఎం సమీక్ష

image

AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

News February 25, 2026

నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయనున్న ప్రభాస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు భారీ నష్టాలు వాటిల్లాయి. దీంతో ప్రభాస్ స్వయంగా స్పందించి ఆ సంస్థకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. తన రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించుకుంటానని చెప్పారట. స్పిరిట్, ఫౌజీ చిత్రాలు పూర్తయ్యాక 2027లో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.