News April 5, 2025

రేషన్ లబ్ధిదారుల ఇంట్లో తింటాం: నిర్మల్ కలెక్టర్ అభిలాష

image

సన్న బియ్యం పంపిణీ పట్ల జిల్లా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తీ ఏర్పాట్లను చేశామన్నారు. ప్రతి నెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన భోజనాన్ని స్వీకరిస్తామని చెప్పారు.

Similar News

News November 11, 2025

JGTL: నిరుద్యోగ మహిళలకు NOV 14న జాబ్ మేళా

image

JGTL జిల్లాలోని నిరుద్యోగ మహిళల జాబ్ మేళాను 14వ తేదీ ఉదయం 10గంటల నుంచి పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు సర్టిఫికెట్ల జిరాక్స్, 2 ఫొటోలు తీసుకునివెళ్లాలి. భోజన వసతి ఉంటుంది. ఈ జాబ్ మేళా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో టి.సదాశివ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. SHARE IT.

News November 11, 2025

ములుగు: పథకం ప్రకారమే లొంగిపోయారు: ‘మావో’ లేఖ

image

ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు సోను, సతీశ్‌లకు మావోయిస్టు పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోను, సతీశ్‌లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని పథకం ప్రకారం లొంగిపోయారన్నారు. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అడవుల్లో మోహరించాయన్నారు.

News November 11, 2025

బాలికల గురుకుల పాఠశాల ఘటనలో నిందితుడు అరెస్ట్

image

కదిరిలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమంగా ప్రవేశించి బాలికలను భయాందోళనకు గురి చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈనెల 4న రాత్రి సమయంలో కుమ్మరోళ్లపల్లి గ్రామానికి చెందిన మహేష్(20) హాస్టల్ గోడదూకి
గురుకులంలోకి ప్రవేశించాడు. అడ్డుకునేందుకు యత్నించిన సెక్యూరిటీ గార్డు ఉమాదేవి, బాలికలను కర్రతో బెదిరించి పారిపోయాడు. ఈ ఘటనపై కదిరి టౌన్ PSలో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.