News September 1, 2024
రేషన్ షాపులో కంది పప్పు ఎక్కడ..?

1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రేషన్ షాపులో బియ్యం, చక్కెర రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. దీనిపై ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే బహిరంగ మార్కెట్ లో నిత్యవసర సరుకులు పెరిగిన నేపథ్యంలో రేషన్ షాపులో గతంలో అందించే కందిపప్పు సరఫరా చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి గతంలో ఇచ్చే అన్ని సరుకులను అందించాలని కోరుతున్నారు.
Similar News
News October 13, 2025
చిత్తూరు పోలీసులకు 34 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల నుంచి 34 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వీటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇందులో అత్యధికంగా భూతగాదాలపై 13 ఫిర్యాదులు అందాయి.
News October 13, 2025
చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
News October 13, 2025
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.