News April 11, 2025

రైతున్నకు అండగా ఉంటాం: MLA సోమిరెడ్డి

image

కష్టాల్లో ఉన్న రైతన్నకు అండగా నిలుస్తామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాచలం మండలం ఇస్కపాళెం, ఈదగాలి, తాటిపర్తిపాళెం, పూడిపర్తి గ్రామాల్లో ఆయన తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పినారు. అకాల వర్షాలతో అన్నదాతకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. సుమారు వెయ్యి పుట్ల ధాన్యం తడిచినట్లు ఆయన పేర్కొన్నారు. 

Similar News

News December 19, 2025

నెల్లూరు: 21 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లాలో 21 నుంచి 23వ తేదీ వరకు 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో కార్యక్రమం జరగనుంది. 2.94 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 2396 పోలియో బూత్‌లలో వీరికి చుక్కలమందు వేయనుండగా.. 403 హై రిస్క్ ఏరియాలు, 82 మొబైల్ బూత్‌లు, బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల వద్ద ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 100 శాతం సక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

News December 19, 2025

నెల్లూరు: స్మార్ట్ ఫోన్.. షార్ప్‌గా ప్రాణాలు తీస్తోంది.!

image

కాలం మారింది. చేతిలో ఫోన్ లేనిదే దిక్కుతోచని స్థితి. చిన్నపిల్లలు, పెద్దలు, విద్యార్థుల వరకు ఇదే పరిస్థితి. ఇదే మాయలో కేటుగాళ్లు అమ్మాయిలపై <<18607181>>పంజా<<>> విసురుతున్నారు. SM వేధికగా ట్రాప్ చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. జొన్నవాడ ఆలయ ఉద్యోగి హిజ్రాను ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం, నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. ఫోన్లు వాడేటప్పుడు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 19, 2025

కోవూరు MLAతో ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటున్న కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశాంతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె రూప్ కుమార్ యాదవ్‌ను కోరారు.