News February 14, 2026

రైతులకు అలర్ట్.. ఖమ్మం మార్కెట్‌కు సెలవు లేదు

image

ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులకు మార్కెట్ కమిటీ అధికారులు కీలక సమాచారం అందించారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాధారణంగా సెలవు ఉంటుందని భావించే రైతులు అయోమయానికి గురికావద్దని, మార్కెట్ పనిచేస్తుందని తెలిపారు. రైతులు తమ మిర్చి పంటను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మార్కెట్‌కు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు.

Similar News

News March 12, 2026

GWMC మేయర్‌కో న్యాయం.. సామాన్య పౌరునికో న్యాయమా?

image

GWMC పన్ను వసూళ్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కాశిబుగ్గలో రూ.13 వేల బకాయి ఉన్న వృద్ధురాలి ఇంట్లో గ్యాస్ సిలిండర్లను సిబ్బంది సీజ్ చేయడం వివాదాస్పదమైంది. అదే సమయంలో మేయర్ సుధారాణికి చెందిన ఆస్తులు, వ్యాపార సంస్థలు రూ.లక్షల పన్ను బకాయిలున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా? అని నిలదీస్తున్నారు.

News March 12, 2026

వనపర్తి డిపోకు రూ.10 కోట్ల ఆదాయం: ఎమ్మెల్యే

image

కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన RTC డిపో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందన్నారు.

News March 12, 2026

అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.