News February 14, 2026
రైతులకు అలర్ట్.. ఖమ్మం మార్కెట్కు సెలవు లేదు

ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులకు మార్కెట్ కమిటీ అధికారులు కీలక సమాచారం అందించారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సాధారణంగా సెలవు ఉంటుందని భావించే రైతులు అయోమయానికి గురికావద్దని, మార్కెట్ పనిచేస్తుందని తెలిపారు. రైతులు తమ మిర్చి పంటను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మార్కెట్కు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు.
Similar News
News March 7, 2026
‘పుష్పక్’ వచ్చేస్తోంది.. హార్ముజ్ దాటిన భారత నౌక

యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సోమవారం నుంచి కేవలం 9 ఓడలు మాత్రమే జలసంధిని దాటాయి. ఇందులో భారత్కు చెందిన ‘పుష్పక్’ కూడా ఉంది. ఇది పెట్రోలియం ఉత్పత్తులను ఇండియాకు తీసుకొస్తోంది. దీంతో దేశంలో ఇంధన నిల్వలకు మరింత బూస్ట్ రానుంది.
News March 7, 2026
నల్గొండ: తల్లి చనిపోయిన దుఃఖంలోనూ ఎగ్జామ్ రాశాడు

కన్నతల్లి మరణించినా, తన భవిష్యత్తు కోసం కన్నీటిని దిగమింగి పరీక్షా హాల్కు వెళ్లాడో విద్యార్థి. నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన శివచరణ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి హేమలత శనివారం మృతి చెందారు. తల్లి మరణంతో శివచరణ్ పుట్టెడు దుఃఖంలోనూ మనోధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరయ్యాడు. శివచరణ్ పట్టుదలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
News March 7, 2026
విజయవాడలో అర్ధరాత్రి డ్రగ్స్ పట్టివేత

విజయవాడలో శుక్రవారం రాత్రి డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి విజయవాడలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా టాస్క్ ఫోర్స్-మాచవరం పోలీసులు సంయుక్తంగా కలిసి అమ్మ కళ్యాణ మండపం సమీపంలో దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 16 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్, 4 సెల్ ఫోన్లు, ఓ కాట మెషీన్ స్వాధీనం చేసుకున్నారు.


