News January 30, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై మొగ్గుచూపేలా, భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని అరికట్టేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. ఇందుకు పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటన, ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కలెక్టర్ గురువారం ఏ.కొండూరు, జి.కొండూరు మండలాల్లో పర్యటించారు.
Similar News
News November 26, 2025
GNT: ఈ పరిస్థితి మీ ప్రాంతంలో కూడా ఉందా.?

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పలువురు నాయకులు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీలకు చెందినవారు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసినవారె, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం సాగటంతో, మళ్లీ వారికే ప్రాముఖ్యత వస్తె తమ పరిస్థితి ఏమిటని? కూటమి వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
News November 26, 2025
నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


