News January 30, 2025

రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి: కలెక్టర్

image

రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై మొగ్గుచూపేలా, భూమిలో సూక్ష్మ పోష‌కాల లోపాన్ని అరిక‌ట్టేలా రైతుల‌కు పెద్ద ఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని.. ఇందుకు పొలం పిలుస్తోంది వంటి కార్య‌క్ర‌మాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌, ఆక‌స్మిక త‌నిఖీల్లో భాగంగా క‌లెక్ట‌ర్ గురువారం ఏ.కొండూరు, జి.కొండూరు మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. 

Similar News

News November 12, 2025

జూబ్లీ వార్.. ఆయనదే గెలుపు.. కాదు కాదు ఆమెదే

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. గెలుపోటములపై ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ. వేల నుంచి రూ. లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్‌లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నట్లు టాక్. ఎన్నిక ఫలితం వెలువడే నాటికి రూ.లక్షల్లో చేతులు మారే అవకాశముందని సమాచారం. ఈ ఉపఎన్నిక ఫలితం 14న వెలువడనుంది.

News November 12, 2025

వేములవాడ: శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభం

image

వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ప్రచార రథంలో శ్రీ స్వామివారి ఉత్సవా విగ్రహాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసి, పక్కనే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. గత నెల 20వ తేదీన శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి దీనిని ప్రారంభించారు.

News November 12, 2025

ఎల్ఈడీ తెరపై వేములవాడ రాజన్న దర్శనం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈరోజు నుంచి ఎల్ఈడీ తెరపై రాజన్నను దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో బుధవారం నుంచి భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో ఆలయ ముందు భాగంలో టెంట్ కింద శ్రీ స్వామివారి ప్రచార రథం, ఎల్ఈడీ తెర ఏర్పాటు చేశారు. భక్తులు ప్రచారరథంలో ఉత్సవ విగ్రహాలను మొక్కుకొని ఎల్ఈడీ తెరపై గర్భాలయంలోని శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు.