News March 5, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

మనుబోలు మండలంలోని మనుబోలు రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వే ప్రక్రియ పర్యవేక్షణకు మనుబోలు మండలానికి వచ్చిన ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం తేమశాతం, కొనుగోలు కేంద్రం రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Similar News

News April 22, 2025

నెల్లూరులో ఇద్దరి ఆత్మహత్య

image

నెల్లూరు జిల్లాలో సోమవారం వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని న్యూ ఎల్బీ కాలనీలో మేస్త్రీ వెంకటేశ్ (42) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విడవలూరులోని గొళ్లపాళేనికి చెందిన నాగార్జున స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

News April 22, 2025

నెల్లూరు: నూతన డీఐఈవోగా ఓ సుబ్బారావు నియామకం

image

నెల్లూరు జిల్లా నూతన డీఐఈవోగా ఓ సుబ్బారావు నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న అధికారి డాక్టర్ ఆదూరు శ్రీనివాసులును చిత్తూరు జిల్లా డీఐఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  నెల్లూరు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి పనిచేస్తున్న మధుబాబును ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

News April 22, 2025

పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.

error: Content is protected !!