News February 22, 2025

రైతులకు మేలు జరిగేలా అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

image

రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ పంట, ఈ కేవైసీ, లోన్ల మంజూరు పై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పై మండల వారీగా వివరాల గురించి ఆరా తీశారు.

Similar News

News October 20, 2025

VJD మెథడ్ అంటే ఏంటి?

image

క్రికెట్ మ్యాచ్‌కు అంతరాయం కలిగినప్పుడు ఓవర్లు కుదించేందుకు, టార్గెట్ రివైజ్ చేసేందుకు డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్(DLS) మెథడ్ ఉపయోగించడం తెలిసిందే. దీనికి బదులుగా వి.జయదేవన్ తన పేరుతో <<18055833>>VJD<<>> మెథడ్ కనిపెట్టారు. ఇందులో సాధారణ అంచనాతో పాటు మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక బ్యాటర్లు దూకుడుగా ఆడే అంశాన్నీ పరిగణించి టార్గెట్ సెట్ చేస్తారు. ఓవర్లు, వికెట్లతో పాటు రియల్ మ్యాచ్ కండీషన్స్‌నూ అంచనా వేసేలా డిజైన్ చేశారు.

News October 20, 2025

PHOTO: పార్వతీపురం బస్టాండ్‌లో పేలిన బ్యాగు ఇదే

image

పార్వతీపురం బస్టాండ్‌లోని ఆదివారం మందుగుండు సామాను పేలిన ఘటనలో అమాయకులు <<18052090>>ప్రాణాపాయస్థితి<<>>లోకి వెళ్లారు. విజయనగరం నుంచి సర్జికల్ వస్తువుల పేరుతో పార్శిల్ చేసిన బ్యాగులో మందుగుండు సామాన్లు పెట్టారు. ఆ బ్యాగు దించే సమయంలో పేలడంతో నలుగురు గాయపడ్డారు. పార్శిల్ కేంద్రంలో కంప్యూటర్, ప్రింటర్లు సైతం ధ్వంసం అయ్యారు. పార్శిల్ బుక్ చేసిన వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.

News October 20, 2025

ఖేడ్‌లో 21న ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్-19 రగ్బీ ఎంపికలు ఈనెల 21న నారాయణఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.