News July 18, 2024

రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తా: కాసుల బాల్‌రాజ్

image

ఆగ్రోస్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తానని రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాలరాజు మాట్లాడుతూ.. పోచారం శీనన్న నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో కూర్చొని గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Similar News

News November 12, 2025

NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

image

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.

News November 12, 2025

NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

image

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.

News November 12, 2025

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: ఎంపీ అర్వింద్

image

ఇందూరు పట్టణంలో పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పసుపు బోర్డుకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్న జిల్లా నేతలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఇందూరు ప్రజలే బుద్ధి చెప్పాలని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.