News March 2, 2025

రైతులతో మాట్లాడిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

image

భామిని మండలం బత్తిలి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడారు. వ్యవసాయంలో పార్వతీపురాన్ని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు అజోలా యూనిట్లను పెంచుతున్నామని అన్నారు. రైతులు పత్తి పంటను తగ్గించి మొక్కజొన్న, వరి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అధికారులు ఉన్నారు.

Similar News

News July 11, 2025

సంగారెడ్డి: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 15లోగా http://nationalawardstoteachers.educatiin.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

image

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్‌ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌ గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.

News July 11, 2025

కరీంనగర్: రేపే చివరి అవకాశం

image

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.