News November 11, 2024
రైతులను మోసం చేస్తే.. మిల్లులు సీజ్ చేస్తాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,320 కన్నా తక్కువగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎవరైనా రైస్ మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేస్తామని హెచ్చరించారు. మిల్లును సీజ్ చేయడంతో పాటు, ఆ మిల్లుకు సంబంధించిన అన్ని రకాల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు.
Similar News
News November 2, 2025
NLG: తిప్పర్తిలో ముందస్తు జనగణన షురూ!

తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తిప్పర్తి రైతు వేదికలో 3 రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
News November 2, 2025
నల్గొండ: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు పొడిగింపు

నల్గొండ శివారు రాంనగర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్ లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 వరకు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 2, 2025
పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జిల్లాలోని ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎంహెచ్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. డీఎంపీహెచ్ఎ(మేల్), డీఎంఎల్, డీఓఏ, డీఏఎన్ఎస్, డీఎంఐటీ, డీఆర్జీఏ, డీఓఎం, డీఈసీజీ, డయాలసిస్, డిఎంఎస్టీతో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


