News August 8, 2024

రైతుల ఆర్థిక అభివృద్ధిపై మంత్రి పొన్నం దిశానిర్దేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ములకనూరు రైతు వేదిక సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులు వ్యవసాయ ఆధార అనుబంధ పనుల వల్ల ఆర్థిక వృద్ధిపై మంత్రి పొన్నం దిశా నిర్దేశం చేశారు. రైతులకు పాడి పశువుల ద్వారా ఆవులు, గేదెలు, నాటు కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫాం, డ్రాగన్ ఫ్రూట్స్, కూరగాయలు ,మామిడి, జామ , బత్తాయి, నిమ్మ ,కొబ్బరి, మునగ, దానిమ్మ, తదితర తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు.

Similar News

News November 16, 2025

MDK: పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం ఆయన శంకరంపేట (ఆర్) మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పుస్తకాలు, మందుల స్టాక్ బోర్డులను నిశితంగా పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశించారు.

News November 16, 2025

మెదక్: ‘బాల్య వివాహం జరిగితే సమాచారం ఇవ్వండి’

image

మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి
హేమ భార్గవి అధికారులు, ప్రజలకు విన్నవించారు. మండల, గ్రామ, తండాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫంక్షన్ హాల్ యజమానులకు, ఫొటోగ్రాఫర్‌లు, బ్యాండ్, పురోహితులు, పాస్టర్లు, ఖాజాలు, ప్రజలు జిల్లాలో ఎక్కడైనా వివాహం నిశ్చయం అవుతున్నట్లు తెలిసిన వెంటనే అమ్మాయికి, అబ్బాయికి వివాహ వయస్సు తెలుకోవాలన్నారు.

News November 16, 2025

MDK: వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయం

image

తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే రూ.27,100 మాయమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఓ వ్యక్తికి 12న వాట్సాప్‌కు వచ్చిన యోనో యాప్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.27,108 నుంచి, 27,100 డెబిట్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వ్యక్తి 1930 కాల్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.