News April 6, 2024

రైతుల గురించి కొప్పుల 30 నిమిషాలు ఆలోచించలేదు: విప్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 31 గంటల దీక్ష చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి రైతుల గురించి ఎప్పుడైనా 30 నిమిషాలైనా ఆలోచించారా అని ధర్మపురి ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు. తన ఎమ్మెల్యే పదవి కాలం ముగిసే లోపు ధర్మపురిలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

కరీంనగర్: శీతాకాలంలో డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగ మంచు కారణంగా దృశ్యమానత తగ్గి రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని.. నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, పొగ మంచు ఉన్న సమయంలో ఓవర్టేక్ చేయవద్దని ఆయన సూచించారు.

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.