News March 20, 2025

రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదు: జేసీ

image

రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.

Similar News

News March 20, 2025

పారిశ్రామిక విధానాలపై ప.గో అధికారులకు అవగాహన 

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కలల సాకారంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ పారిశ్రామిక విధానాల గురించి అధికారులకు అవగాహన కల్పించారు.

News March 20, 2025

తాడేపల్లిగూడెం యువకుడిపై పోక్సో కేసు

image

తాడేపల్లిగూడేనికి చెందిన సత్య అనే యువకునిపై విశాఖలో పోక్సో కేసు నమోదైంది. విశాఖకు చెందిన 17 ఏళ్ల బాలిక డెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. స్వీట్ షాపులో పనిచేస్తున్న సత్యతో పరిచయం ఏర్పడింది. ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ విజయవాడలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు విశాఖ తీసుకోచ్చారు. సత్యపై పోక్సో కేసు నమోదు చేశారు.

News March 20, 2025

ప.గో : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 377 మంది దూరం

image

టెన్త్ విద్యార్థులకు బుధవారం ద్వితీయ భాష హిందీ పరీక్ష జరిగింది. పరీక్షకు 21999 మంది విద్యార్థులకు గాను 21622 మంది విద్యార్థులు హాజరు కాగా 377 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 98.29% శాతం హాజరయ్యారని డిఇఓ నారాయణ తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ ఆంగ్ల పరీక్షకు 457 మంది విద్యార్థులకు గాను 370 విద్యార్థులు హాజరు కాగా 87 గైర్హాజరయ్యారన్నారు.

error: Content is protected !!