News December 29, 2024

రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం: కలెక్టర్

image

సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. పులివెందుల జీజీహెచ్ మార్చురీలో రైతు కుటుంబ సభ్యుల మృత దేహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన రైతు కుటుంబ సమీప బంధువులతో మాట్లాడారు. రైతు కుటుంబ నేపథ్యం, వ్యవసాయంలో లాభనష్టాలు, ఆత్మహత్యకు దారితీసిన ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 19, 2025

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై వేటు

image

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

News October 18, 2025

కడప: దీపావళి పండగకు 33 ప్రత్యేక బస్సులు

image

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 18, 2025

ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

image

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.