News January 21, 2025
రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం: ADB కలెక్టర్

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావ్ కుటుంబాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పరమార్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
Similar News
News December 4, 2025
ADB: అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఆర్వో స్టేజ్ 2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలని వివరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.
News December 4, 2025
అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోండి: సీఎం

గ్రామాలను అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి అడ్డుకునే వారు, పంచాయితీలు పెట్టే వారితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
News December 4, 2025
KCR కుటుంబంలో పైసల పంచాయితీ: సీఎం

ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించిన BRS పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పుడు KCR కుటుంబంలో పైసల పంచాయితీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. కొడుకు KTR ఒకవైపు, బిడ్డ కవిత మరో వైపు, KCR ఫామ్ హౌస్లో ఉన్నారని విమర్శించారు.


