News February 26, 2026

రైతు నేస్తం.. భద్రాద్రి కలెక్టర్ జితేష్‌ వి పాటిల్‌

image

భద్రాద్రి కలెక్టర్‌గా పనిచేసిన జితేష్‌ వి పాటిల్‌ TGNPDCL సీఎండీగా బదిలీ అయ్యారు. తన పదవీ కాలంలో నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ముఖ్యంగా సాగు రంగంలో వినూత్న మార్పుల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మునగ, ఆయిల్‌పామ్‌ సాగుతో పాటు చేపలు, బాతుల పెంపకం, వర్మీ కంపోస్టు తయారీపై రైతులను ప్రోత్సహిస్తూ రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు.

Similar News

News April 13, 2026

IPL తరహాలో గుంతకల్లులో క్రికెట్ టోర్నమెంట్

image

గుంతకల్లులోని పాతగుంతకల్లులో ఐపీఎల్ తరహాలో ఓల్డ్ గుంతకల్ ప్రీమియర్ లీగ్ (ఓజీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఐపీఎల్ తరహాలోనే టీం సెలక్షన్, ప్లేయర్స్ యాక్షన్ జరిగింది. ఆదివారం జరిగిన ప్లేయర్స్ యాక్షన్‌లో పలువురు పాతగుంతకల్లు యువకులు పాల్గొన్నారు. షాడో బ్లాస్టర్స్, సిడ్నీ సిక్సర్స్, కిట్టు స్మాషర్స్, రాయల్ స్ట్రైకర్స్, ఛాంపియన్ చేజర్స్ టీమ్స్ ఉన్నాయి. త్వరలోనే టోర్నీ ప్రారంభంకానుంది.

News April 13, 2026

పార్వతీపురం జిల్లాలో 42 మందిపై కేసులు నమోదు: ఎస్సీ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.

News April 13, 2026

ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

image

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.