News June 20, 2024

రైతు బ‌జార్ల ద్వారా ట‌మోటా: కలెక్టర్ ఢిల్లీ రావు

image

ట‌మోటా ధ‌ర‌లు అధికంగా ఉన్న నేప‌థ్యంలో మార్కెటింగ్ శాఖ‌ చిత్తూరు జిల్లా నుంచి ట‌మోటాను కొనుగోలు చేసి లాభం న‌ష్టం లేని విధంగా వినియోగ‌దారుల‌కు రైతుబ‌జార్ల ద్వారా అందిస్తున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ జిల్లా ధ‌ర‌ల ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌తో క‌లిసి మార్కెట్లో టమాటాలు, కూర‌గాయ‌ల ల‌భ్య‌త‌తో పాటు వాటి ధ‌ర‌ల‌పై చ‌ర్చించారు.

Similar News

News November 21, 2025

MTM: గోనె సంచుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచుల లభ్యత, నాణ్యతను పరిశీలించారు. అంతక ముందు గ్రామంలో ఇటీవల నిర్మించిన పంచాయతీ రాజ్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

News November 20, 2025

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్

image

మచిలీపట్నంలో సాగర్ కవాచ్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘సాగర్ కవచ్’ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

News November 20, 2025

కృష్ణా: ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి లభించింది. పలు మండలాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, ఏఓ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.