News January 25, 2025
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: జనగామ కలెక్టర్

రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇంతకు ముందే పాసు పుస్తకం కలిగి ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News December 16, 2025
NIPERలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్ (NIPER) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. BE, బీటెక్, B.COM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్సైట్: https://niperahmnt.samarth.edu.in
News December 16, 2025
ధర్మపురి: మూడో విడత.. 6 మండలాలు.. 119 సర్పంచ్ స్థానాలు

మూడో విడతలో వెల్గటూర్, పెగడపల్లి, గొల్లపల్లి, ఎండపల్లి, బుగ్గారం, ధర్మపురి మండలాలలో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 119 సర్పంచ్ స్థానాలకు గాను 6 స్థానాలు ఏకగ్రీవం కాగా 113 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే 1088 వార్డు స్థానాలలో 228 వార్డులు ఏకగ్రీవం కాగా 860 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 16, 2025
డెలివరీ తర్వాత డిప్రెషన్ తగ్గాలంటే

గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈక్రమంలో కొందరు డెలివరీ తర్వాత డిప్రెషన్కు లోనవుతున్నారు. ఒత్తిడి, ప్రెగ్నెన్సీలో సమస్యలు, వంశపారంపర్యం వల్ల కూడా కొందరు డిప్రెషన్ బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం, సన్నిహితులు, కుటుంబీకులతో ఎక్కువగా గడపడం, సరిపడా నిద్రపోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>


