News June 25, 2024
రైతు భరోసా పథక అమలుకు పటిష్ట కార్యాచరణ: మంత్రి తుమ్మల

ఖమ్మం: రైతు భరోసా పథక అమలుకు పటిష్ట కార్యాచరణ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రైతుల నుండి అభిప్రాయ సేకరణను క్రోడీకరించి, రైతు భరోసా పై కార్యాచరణ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: SEC

ఖమ్మం: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు. టి-పోల్ వెబ్ సైట్, ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించి ఫిర్యాదులను పరిష్కరించాలని పేర్కొన్నారు.
News November 26, 2025
ప్రింటర్లకు నోటీసులు జారీ చేయాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రింటర్లకు నోటిసులు జారీ చేయాలని, అనుమతి లేకుండా ఎటువంటి రాజకీయ సంబంధ నోటిసులు ముద్రణ చేయవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఎన్నికల సంబంధించి బిల్లులు వెంటనే సమర్పించాలని, కలెక్టరేట్లో జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రి మండల స్థాయిలో అందుబాటులో పెట్టాలని పేర్కొన్నారు.
News November 26, 2025
అటవీ పరిరక్షణకు కమ్యూనిటీల మద్దతు అవసరం: డీఎఫ్ఓ

అటవీ సంరక్షణ చర్యలలో కమ్యూనిటీలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) భాగస్వామ్యం కావడాన్ని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ (ఐఎఫ్ఎస్) స్వాగతించారు. ఖమ్మం అటవీ శాఖతో కలిసి పనిచేయడానికి వాలంటీర్లు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ భాగస్వామ్యం వలన పరిరక్షణ చర్యలు మరింత బలోపేతం అవుతాయని డీఎఫ్ఓ తెలిపారు.


