News April 5, 2025
రైలులో బాలికపై అత్యాచారం.. గాంధీలో వైద్యపరీక్షలు

ఈనెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో అత్యాచారానికి గురైన బాలికకు(12) గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ను అందించారు. కుటుంబ సభ్యులతో HYD వస్తున్న బాలిక.. అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్ రూమ్కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 13, 2025
అధికారికంగా జూబ్లీహిల్స్లో 48.49% ఓటింగ్

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.
News November 13, 2025
HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 12, 2025
HYD మహిళా ఉద్యోగినుల కోసం ఉచిత ఆరోగ్య సదస్సు

గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించే పోస్టర్ను టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా కమిటీ ఈ రోజు విడుదల చేసింది. జిల్లా మహిళా ఉద్యోగుల కోసం నవంబర్ 25న ఉచిత ఆరోగ్య సదస్సు ఉంటుందని యూనియన్ నాయకులు మారమ్ జగదీశ్వర్, డా.ఎస్.ఎం. హుస్సేని ప్రకటించారు. ఉద్యోగినులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు.


